Wednesday 4 May 2011

"పాడుతా తియ్యగా" కొత్త అంకం

శ్రీ SP బాలు గారి ఆధ్వర్యంలో "పాడుతా తియ్యగా" కొత్త అంకం E TV లో ప్రారంభం అయ్యింది. 

పిల్లలు చాలా ఉత్సాహంగా పాడారు.  మొదటి భాగం బాగుంది. 

మొదట పాడిన పాప, చివరగా పాడిన పాప మిగిలిన వారందరికంటే బాగా పాడారు.  ఇద్దరికీ మార్కులలో తేడా 10  కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. నిజానికి మొదటగా పాడిన పాప కంటే చివరగా పాడిన పాపకి కొంచం మార్కులు ఎక్కువ వేయొచ్చు అనిపించింది.  చివరగా పాడిన పాప గొంతులో దమ్ము (ఆయాసం) వినిపించలా. చక్కగా పాడింది.  ఆ పాప పాడిన పాటలో ఫీలింగ్ అక్కడక్కడ తప్పింది అనటం కూడా సరికాదేమో.  చిన్నపిల్ల - ఆ గొంతులో మహాగాయని సుశీల పలికిన ఫీలింగ్ ఉండాలనుకోవటం కుదరదేమో.

ఏమైనా మంచి టాలెంట్ ఉన్న పిల్లలు కనిపించారు.  వాళ్ళు మరిన్ని మంచి పాటలు రాబోయే ఎపిసోడ్ లలో వినిపిస్తారని ఆశిద్దాం.



No comments:

Post a Comment