Tuesday 19 April 2011

పాకుతా మెల్లగా మెల్లగా !!!!!!

E TV లో ప్రముఖ సినీ గాయకుడు శ్రీ శ్రీపతి  పండితరాధ్యుల   బాల సుబ్రహమణ్యం గారి ఆధ్వర్యంలో నిర్వహించపడుతున్న"పాడుతా తీయ్యగా" కార్యక్రమం ఫైనల్స్ అంకం జీళ్ళపాకంలా మెల్లగా సాగుతుంది. 
 
ఆ చిన్నపిల్లలని ఎందుకు అంత క్షోభ పెడుతున్నారో అర్థం కావడం లేదు.  4 వారాలుగా ఫైనల్స్ సాగుతూనే వుంది ...
 
చాలామందికి వీక్షకులకి విజేత ఎవరో  ఈ పాటికే తెలిసినట్టుగా ఉంది శ్రీ బాలుగారి హావభావాల వల్ల.
 
సాగతీతగా  ఈ కార్యక్రమం జరగడానికి బహుశా వారు అనుకున్నవిధంగా ఈ కార్యక్రమానికి డబ్బులు వచ్చి ఉండకపోచ్చు లేదా బాగా డబ్బులు వస్తూ ఉండవచ్చు లేదా బహుమతి మొత్తం ఎక్కువగా ఇస్తున్నాము అని బాధ ఉండవొచ్చు.
 
ఒన్స్ మోర్ లు వస్తున్నాయి కదాని పద్యం రాగాలు ఎక్కువ తీసినట్టు...
ద్రౌపది చీరలు ఎక్కువ లాగినట్టు టీవీ సేరియల్స్ తో వేగలేక పోతున్నాం . ఇక ఇవి కూడా చేరితే మనమే వెళ్లి యాడ్స్ ఇచ్చే వాళ్ళను ఇవ్వ వద్దని బతిమాలాలి
 
ఏదిఏమైన ఆ పిల్లలని ఇంకా  బాధించక తాను అనుకున్న వాళ్లకి బహుమతి ఇచ్చి కార్యక్రమం ముగించేస్తే మంచిది బాలుగారు.  will you pl hear me    
     

3 comments:

  1. ప్రసారంలో మాత్రమే ఆ సాగతీత, ముందే అన్ని ఎపిసోడ్స్ ఒకే సారి షూట్ చేస్తారు. అందులో పాల్గొన్న పిల్లలకు విజేత అన్నది అప్పుడే తెలిసిపోతుంది.. కేవలం ప్రేక్షకులకు మాత్రమే ఈ టెన్షన్..సాగతీత.

    ReplyDelete
  2. డబ్బులు వస్తూ వున్నాయా? :D

    ReplyDelete
  3. andariki telusu vijeta evaro......miru cheppindi nijame andi

    ReplyDelete